ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారాణసీ, అయోధ్య, మథురలో బీజేపీకి షాక్‌

ABN, First Publish Date - 2021-05-05T07:37:15+05:30

ఉత్తరప్రదేశ్‌ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కీలక స్థానాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి ఆధిక్యం వచ్చినా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణసీలో బీజేపీ ఓడిపోయింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • యూపీ జడ్పీ ఎన్నికల్లో ఆ స్థానాల్లో ఓటమి

వారాణసీ/అయోధ్య, మే 4: ఉత్తరప్రదేశ్‌ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కీలక స్థానాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి ఆధిక్యం వచ్చినా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణసీలో బీజేపీ ఓడిపోయింది. 40 సీట్లున్న వారాణసీలో బీజేపీకి 8 స్థానాలే దక్కగా.. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) 15 స్థానాల్లో గెలిచింది. బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)కి 5, అప్నా దళ్‌కు 3, సుహెల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీకి ఒకటి, ఇండిపెండెంట్లకు 8 సీట్లు దక్కాయి. 40 సీట్లున్న అయోధ్యలోనూ కమలం పార్టీ 9 స్థానాల్లోనే గెలిచింది. ఇక్కడ ఎస్పీ 17 చోట్ల గెలవగా.. బీఎస్పీకి 4, స్వతంత్రులు 10 స్థానాల్లో గెలిచారు. అలాగే 33 సీట్లున్న మథురలోనూ బీజేపీ 8 సీట్లే సాధించింది. ఇక్కడ బీఎస్పీ 13 స్థానాల్లో గెలవగా.. రాష్ట్రీయ లోక్‌దళ్‌, ఎస్పీ చెరో సీటును దక్కించుకున్నాయి. మిగతా చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 


Updated Date - 2021-05-05T07:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising