ప్రధాని మోదీకి రాపోలు ఆనంద్ లేఖ
ABN, First Publish Date - 2021-08-31T17:48:03+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బీజేపీ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ లేఖ రాశారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బీజేపీ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ లేఖ రాశారు. కులాల వారీగా జన గణన చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రంలో ఉన్న డిమాండ్ ఆధారంగా కులాల వారీగా జనగణన చేపట్టాలన్నారు. మోదీ ఆధ్వర్యంలో అనేక క్రియాశీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఈ కులాల ఆధారిత జనగణన కూడా మోదీ నేతృత్వంలో జరగాలని చెప్పారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కమిటీల సూచనల మేరకు మోదీ కులాల వారీగా జన గణనపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 17న మోదీ జన్మదినం సందర్భంగా కులాల ఆధారిత జనగణనకి శ్రీకారం చుట్టాలన్నారు. కులాల వారీగా జనగణన వల్ల సామాజిక న్యాయం, కేంద్ర పధకాలు పారదర్శకంగా వెనకబడిన తరగతులకి అందే అవకాశం ఉంటుందని రాపోలు ఆనంద భాస్కర్ లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2021-08-31T17:48:03+05:30 IST