ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నన్ను బీజేపీ బెదిరించలేదు: అభిషేక్ బెనర్జీ

ABN, First Publish Date - 2021-03-06T22:21:34+05:30

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులను ఉసిగొల్పడం ద్వారా తనను బీజేపీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెస్ట్ మిడ్నాపూర్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులను ఉసిగొల్పడం ద్వారా తనను బీజేపీ బెదిరించ లేదని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. ఒక నేత విషయంలో బీజేపీ ఇదే పని చేసిందని, తన విషయంలో మాత్రం ఈ బెదిరింపులు సాగవని పేర్కొన్నారు.


వెస్ట్ మిడ్నాపూర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ... 'బెదిరించి ఆయనను (సువేందు అధికారి) బీజేపీలోకి లాక్కుకున్నట్టు నన్ను కూడా ఈడీ, సీబీఐలతో బెదిరించ గలమని వాళ్లు (బీజేపీ) అనుకుంటున్నారా? మేమిద్దరం మనుషులమే. కానీ మా వెన్నెముకల్లో వ్యత్యాసం ఉంది. ఆయన (సువేందు) తన వెన్నెముకను అమ్ముకున్నారు. నేను మాత్రం నా వెన్నెముకను అమ్మకానికి పెట్టను. వాళ్లు కొనుగోలు చేయనూ లేరు' అంటూ బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. తన గొంతు కోసినా  'జై హింద్, జై బంగ్లా, జై మిడ్నాపూర్, జై మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ జిందాబాద్' నినాదాలు మాననని మరోసారి ఆయన స్పష్టం చేశారు. బొగ్గు కుంభకోణంలో ఇటీవల సీబీఐ బృందం అభిషేక్ నివాసానికి వెళ్లి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆయన భార్యకు నోటీసులు ఇచ్చారు. జైలు పేరు చెప్పి బెంగాల్ ప్రజల్ని బెదరించలేరంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ పరిణామాలపై వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-03-06T22:21:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising