ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇదేం బర్త్ డే పార్టీ?: మాస్కులు పెట్టుకోలేదు కానీ తుపాకులు పట్టుకొచ్చారు!

ABN, First Publish Date - 2021-05-21T23:31:37+05:30

కరోనా కట్టడికి ప్రభుత్వం పలు ఆంక్షలు అమలు చేస్తోంది. మాస్కు ధరించకుండా బయటకు వచ్చే వారిని పోలీసులు చావగొడుతున్నారు. కూరగాయాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మధ్యప్రదేశ్‌లో కరోనా కట్టడికి ప్రభుత్వం పలు ఆంక్షలు అమలు చేస్తోంది. మాస్కు ధరించకుండా బయటకు వచ్చే వారిని పోలీసులు చావగొడుతున్నారు. కూరగాయాలు కొనేందుకు కుమార్తెతో కలిసి వచ్చిన ఓ మహిళ మాస్క్ ధరించలేదన్న కారణంతో పోలీసులు చితకబాదారు. మహిళ అని కూడా చూడకుండా కిందపడేసితన్నారు. ఆమెపై విచక్షణ రహితంగా దాడిచేశారు. సాగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహిళపై ఇష్టానుసారం దాడిచేసిన పోలీసు తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


తాజాగా, అదే రాష్ట్రంలో జరిగిన ఓ బర్త్ డే పార్టీకి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. బిహిండ్ జిల్లాలో జరిగిన ఈ బర్త్ డే వేడుకకు వందలాదిమంది హాజరయ్యారు. వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా మాస్కు పెట్టుకోలేదు సరికదా, చాలామంది చేతుల్లో తుపాకులు ఉన్నాయి. వారు తుపాకులు గాలిలో ఊపడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక నేత రాజేశ్ బఘేల్ తన కుమారుడి కోసం ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. 


మాస్క్ ధరించనందుకు ఓ మహిళపై విచక్షణ రహితంగా దాడిచేసిన పోలీసులు ఈ బర్త్ డే పార్టీకి హాజరైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. పార్టీకి హాజరైన వారిలో ఒక్కరు కూడా మాస్క్ ధరించలేదని, పైగా తుపాకులు పట్టుకొచ్చిన వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్పందించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Updated Date - 2021-05-21T23:31:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising