ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-02-01T13:45:42+05:30

బీహార్ బోర్టు ఇంటర్ పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా సమయంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: బీహార్ బోర్టు ఇంటర్ పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా సమయంలో బీహార్‌లోనే తొలిసారిగా బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల సందర్భంగా విద్యార్థులు షూస్ వేసుకుని రావాలన్న నిబంధనకు సడలింపునిచ్చారు. అయితే పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీలను అమర్చారు. వీటి ద్వారా పరీక్షల తీరుతెన్నులను పర్యవేక్షించనున్నారు. ప్రతీ ఐదువందల మంది విద్యార్థులకు ఒక వీడియోగ్రాఫర్ ఉండనున్నారు.


పది నిముషాల ముందుగా విద్యార్థులను పరీక్షా గదులలోకి అనుమతించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి 1473 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 13 లక్షల, 50 వేల, 233 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 25 మంది పరీక్షార్థులకు ఒక ఇన్విజిలేటర్ ఉండనున్నారు. పరీక్షల నిర్వహణకు బీహార్ ఎడ్యుకేషన్ బోర్డు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా రూపొందించింది. దీని సాయంతో డీఈవో, డీఎంలు పరీక్షలను పర్యవేక్షించనున్నారు. ఉదయం 9:30 నుంచి 12:45 వరకూ, సాయంత్రం 1:45 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి.

Updated Date - 2021-02-01T13:45:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising