బీహార్ బీజేపీ సీనియర్ నేత అజ్ఫర్ దారుణ హత్య
ABN, First Publish Date - 2021-01-27T20:28:30+05:30
బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి అజ్ఫర్ షాంసి దారుణ హత్యకు గురయ్యారు. ఇవాళ ఉదయం 11:30 గంటలకు ముంగేర్ జిల్లా జమాల్పూర్లో
పాట్నా: బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి అజ్ఫర్ షాంసి దారుణ హత్యకు గురయ్యారు. ఇవాళ ఉదయం 11:30 గంటలకు ముంగేర్ జిల్లా జమాల్పూర్లో గుర్తు తెలియని దుండగులు ఆయనను కాల్చి చంపారు. ముంగేర్లోని ఆర్ఎస్ఎస్ ఇంటర్ ఈవినింగ్ కాలేజీలో అజ్ఫర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. కారు దిగి కాలేజీలోకి వెళ్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ... అజ్ఫర్ను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పట్టపగలు నడిరోడ్డు మీద అధికార బీజేపీ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేతను కాల్చిచంపడంపై స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామనీ.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని స్థానిక పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.
Updated Date - 2021-01-27T20:28:30+05:30 IST