Covid protocols: ఒడిశా నేషనల్ పార్కు పునర్ ప్రారంభం
ABN, First Publish Date - 2021-08-05T16:14:48+05:30
కొవిడ్-19 మార్గదర్శకాలను అనుసరించి సామాజిక దూరం పాటిస్తూ భితార్ కనిక నేషనల్ పార్కును గురువారం నుంచి పునర్...
భువనేశ్వర్ (ఒడిశా): కొవిడ్-19 మార్గదర్శకాలను అనుసరించి సామాజిక దూరం పాటిస్తూ భితార్ కనిక నేషనల్ పార్కును గురువారం నుంచి పునర్ ప్రారంభించారు.కరోనా వైరస్ ప్రభావం, మొసళ్ల సంభోగం, గుడ్లు పెట్టే కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మే 1వతేదీన మూసివేసిన జాతీయ ఉద్యానవనాన్ని గురువారం తెరిచారు.ఈ పార్కును సందర్శించే పర్యాటకులు కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం సామాజిక దూరం పాటించాలని జూ అధికారులు నిర్ణయించారు.సందర్శకులు మాస్కులు ధరించి, గైడ్ ను వెంట తీసుకొని రావాలని అధికారులు సూచించారు.కొవిడ్ ప్రబలకుండా పర్యాటకుల కోసం శానిటైజర్లను కూడా సిద్ధంగా ఉంచారు.
Updated Date - 2021-08-05T16:14:48+05:30 IST