ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీలో బీజేపీ నేత హత్య... ఇంటికి 20 మీటర్ల దూరంలో మృతదేహం!

ABN, First Publish Date - 2021-08-09T15:07:32+05:30

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బారాబంకీ: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో కొందరు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. సుబేహా పోలీస్ స్టేషన్ పరిధిలోని పండిత్ పుర్వా గ్రామంలో ఇంటిలో ఒంటరిగా ఉంటున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత హరిహర్ సింగ్‌(65)ను హత్య చేశారు. ఈ హత్యకు ఆస్తి తగాదాలే కారణమని తెలుస్తోంది. 


హరిహర్ సింగ్ మృతదేహం అతని ఇంటి వెనుక కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. బీజేపీ బూత్ అధ్యక్షునిగా పనిచేస్తున్న హరిహర్ సింగ్‌కు సంతానం లేదు. భార్య కూడా ఇటీవలే కన్నుమూసింది. దీంతో అతను ఇంటిలో ఒంటరిగా ఉంటున్నాడు. మృతుని మెడపై గాట్లను పోలీసులు గుర్తించారు. మృతుని ఇంటికి 20 మీటర్ల దూరంలోనే అతని మృతదేహం లభ్యమయ్యింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-09T15:07:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising