Ayodhya : డిసెంబర్ 2023 నాటికి దర్శనం
ABN, First Publish Date - 2021-08-04T22:56:29+05:30
అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం డిసెంబర్ 2023 నాటికి పూర్తికానుంది. భక్తులందరూ డిసెంబర్
లక్నో : అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం డిసెంబర్ 2023 నాటికి పూర్తికానుంది. భక్తులందరూ డిసెంబర్ 2023 నాటికి రాముణ్ని దర్శించుకోవచ్చని రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ట్రస్ట్ కొన్ని రోజుల క్రిందటే ప్రకటించింది. ఇదే విషయాన్ని ట్రస్ట్ మరోసారి పునరుద్ఘాటించింది. గురువారానికి (5-8-2021) నాటికి రామ మందిర నిర్మాణం ప్రారంభమై యేడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి వర్చువల్గా ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు చేరుకొని, పూజలు నిర్వహిస్తారని ట్రస్ట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Updated Date - 2021-08-04T22:56:29+05:30 IST