ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటీఎంలో చోరీకి యత్నం.. అడ్డుకున్న వృద్ధుడి హత్య

ABN, First Publish Date - 2021-06-20T15:34:32+05:30

తిరువారూర్‌ సమీపంలో ఏటీఎంలో చోరీని అడ్డుకున్న వృద్ధుడిని దుండగులు హత్య చేశారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరువారూర్‌ తిరుత్తరైపూం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                 - నలుగురు యువకుల అరెస్టు


పెరంబూర్‌(చెన్నై): తిరువారూర్‌ సమీపంలో ఏటీఎంలో చోరీని అడ్డుకున్న వృద్ధుడిని దుండగులు హత్య చేశారు. ఈ  ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరువారూర్‌ తిరుత్తరైపూండి రోడ్డు కూట్టూరులో ఎస్‌బీఐ ఏటీఎం ఉంది. శనివారం తెల్ల వారుజామున ఏటీఎంలోకి ప్రవేశించిన నలుగురు వ్యక్తులు గ్యాస్‌ వెల్డింగ్‌ ద్వారా యంత్రాన్ని పగులగొట్టేందుకు యత్నించారు. ఏటీఎం నుంచి శబ్దం వస్తుండడంతో అదే ప్రాంతానికి చెందిన తమిళరసన్‌ అనే వృద్ధుడు అక్కడికి చేరుకొని, ఏటీఎంలో చోరీ జరుగుతోందని గ్రహించి కేకలు వేశాడు. ఊహించని పరిణామానికి ఖంగుతిన్న అగంతకులు వృద్ధుడిపై దాడి చేయడంతో అతడు తీవ్రగాయాలతో సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. వృద్ధుడి కేకలకు అక్కడికి చుట్టుపక్కల వారు చేరుకోవడాన్ని గమనించిన అగంతకులు పారిపోతుండగా మదన్‌ అనే నిందితుడిని ప్రజలు పట్టుకుని పోలీసులు అప్పగించగా, మిగిలిన ముగ్గురు పరారయ్యారు. పరారైనప్రతాప్‌, ఆకాష్‌, విజయన్‌లను పోలీసులు వడపాదిమంగళం ప్రాంతంలో  అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన నిందితులు 20 ఏళ్లలోపు వారు కావడం అటు పోలీసులు, ఇటు ప్రజలను దిగ్ర్భాంతికి గురిచేసింది.


Updated Date - 2021-06-20T15:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising