ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండోనేషియా బంగారు గనిలో ఘోర ప్రమాదం

ABN, First Publish Date - 2021-02-25T13:20:24+05:30

ఇండోనేషియా దేశంలోని బంగారం గనిలో ఘోర ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 70 మంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండచరియలు విరిగిపడి ఐదుగురి దుర్మరణం, 70 మంది గల్లంతు

జకార్తా (ఇండోనేషియా): ఇండోనేషియా దేశంలోని బంగారం గనిలో ఘోర ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 70 మంది గల్లంతయ్యారు. ఇండోనేషియా దేశంలోని సెంట్రల్ సులావేసిలోని బంగారపు గనిలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మరణించగా, మరో 70మంది గల్లంతయ్యారు.పరిగి మౌంటాంగ్ జిల్లాలోని బురంగా గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. కొండచరియలు విరిగిపడిన బంగారపు గనిలో నుంచి ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. మరో 70 మంది గల్లంతయ్యారని, వారు కొండచరియల కింద ఉంటారని వారి కోసం శోధిస్తున్నామని ఇండోనేషియా డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ అధిపతి దాటూ పముసు చెప్పారు. కొండచరియలు విరిగిపడిన గనిలో మృతదేహాలను వెలికితీసేందుకు సహాయపునరావాస సిబ్బంది యత్నిస్తున్నారు. 

Updated Date - 2021-02-25T13:20:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising