ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీని ఓడించేందుకు ఐదుపార్టీలతో కాంగ్రెస్ దోస్తీ!

ABN, First Publish Date - 2021-01-20T12:12:25+05:30

ఈ ఏడాది దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో అసోం ఒకటి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తలపడేందుకు కాంగ్రెస్ పార్టీ ఇతర ఐదు పార్టీలతో జతకట్టి ఎన్నికల బరిలోకి దిగేందుకు సమయాత్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ బరుద్దీన్ అజ్మల్ సారధ్యంలోని ఆల్ ఇండియా యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్)తో పాటు ఐదు పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 


బీజేపీని అధికారంలో నుంచి దింపేందుకు తాము మహాకూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్‌లు ప్రకటించాయి. ఈ కూటమిలో ఈ రెండు పార్టీలతో పాటు నాలుగు లెఫ్ట్ పార్టీలు కూడా భాగస్వామ్యం కానున్నాయి. గువాహటిలో ఏర్పాటు చేసిన ఒక మీడియా సమావేశంలో కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), అంచలిక్ గణ మోర్చా నేతలు తమ ఆరు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. అసోం ప్రజల సంక్షేమం కోరి తామంతా కలసి పోటీచేస్తున్నట్లు ప్రకటించాయి. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఆ పార్టీని ఓడించేందుకు తమ కూటమితో జతకట్టాలని అభ్యర్థించాయి. 2021లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం మొదలైనవి ఉన్నాయి.

Updated Date - 2021-01-20T12:12:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising