అంటార్కిటికాలో 3600 కిలోమీటర్ల నడక!
ABN, First Publish Date - 2021-12-25T09:17:59+05:30
భవిష్యత్తులో మనిషి అంగారకుడి(మార్స్)పైకి వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితులకు మానవ శరీరం ఏ విధంగా స్పందిస్తుంది? ..
మార్స్పై పరిస్థితులను అంచనా వేసేందుకు నాసా..
ఈఎ్సఏ పర్యవేక్షణలో ఇద్దరు బ్రిటన్ సాహసికుల యత్నం
న్యూఢిల్లీ, డిసెంబరు 24: భవిష్యత్తులో మనిషి అంగారకుడి(మార్స్)పైకి వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితులకు మానవ శరీరం ఏ విధంగా స్పందిస్తుంది? ఎలా అలవాటుపడుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు బ్రిటన్ పరిశోధకులు జస్టిన్ పాక్షా, జేమీ ఫేసెస్ చిల్డ్స్ అంటార్కిటికాలో 3600 కిలోమీటర్ల మేర నడిచే సాహసయాత్రను చేపట్టారు. నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈఎ్సఏ) సంయుక్తంగా పర్యవేక్షిస్తున్న ఈ యాత్ర నెల రోజుల క్రితం మొదలైంది. మైనస్ 55 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదయ్యే అంటార్కిటికాలో మనిషి శారీరక, మానసిక పరిధులను పరీక్షించడంతో పాటు.. అంగారకుడిపై అలవాటుపడటం సాధ్యమేనా అన్న కోణంలోనూ అధ్యయనం చేసేందుకు ఈ యాత్ర ఉపకరిస్తుందని ఈఎ్సఏ తెలిపింది. 80 రోజులు సాగే యాత్రలో.. మంచుఖండంపై పరిస్థితుల గురించి వారి ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నామని పేర్కొంది.
Updated Date - 2021-12-25T09:17:59+05:30 IST