మళ్లీ ‘అమ్మ’ పాలన తేవాలి: శశికళ
ABN, First Publish Date - 2021-02-25T06:55:24+05:30
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత
చెన్నై, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బుధవారం తన రాజకీయ కార్యకలాపాలను పునఃప్రారంభించారు. జయలలిత జయంతి సందర్భంగా టి.నగర్లోని నివాసంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి శశికళ మాట్లాడుతూ.. జయలలితకు విశ్వాసులుగా పనిచేసిన కార్యకర్తలు, నాయకులు, అనుచరులు కలిసికట్టుగా రాష్ట్రంలో మళ్లీ అమ్మ పాలన ఏర్పాటుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. అన్నాడీఎంకే కార్యకర్తలందరికీ తాను అండగా ఉంటానని ప్రకటించారు.
Updated Date - 2021-02-25T06:55:24+05:30 IST