అమ్మా క్యాంటీన్లపై కమల్హాసన్ ఏమన్నారో తెలిస్తే...
ABN, First Publish Date - 2021-10-24T15:09:30+05:30
రాష్ట్రంలో పేదల క్షుద్బాధను తీర్చేందుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఏర్పాటు చేసిన అమ్మా క్యాంటీన్లను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్ కోరారు. ఇదే విషయంపై
అడయార్(Tamilnadu): రాష్ట్రంలో పేదల క్షుద్బాధను తీర్చేందుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఏర్పాటు చేసిన అమ్మా క్యాంటీన్లను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్ కోరారు. ఇదే విషయంపై ఆయన శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న అమ్మా క్యాంటీన్ల పనితీరు భేషుగ్గా ఉండటంతోపాటు అనేకమంది పేదలు మూడు పూటలా కడుపునింపుకునేందుకు బాగా ఉపయోగపడుతుండటంతో అనేక రాష్ట్రాలు ఈ తరహా క్యాంటీన్లను తమ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపాయన్నారు. అయితే, ఈ క్యాంటీన్లలో రాత్రిపూట అందుబాటులో వుండే ఆహారంలో మార్పులు చేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయని కమల్ గుర్తుచేశారు. నిజానికి అనేకమంది ఆకలిని తీర్చుతున్న ఈ క్యాంటీన్లను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమల్హాసన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Updated Date - 2021-10-24T15:09:30+05:30 IST