ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amith shsh : ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక భేటీ

ABN, First Publish Date - 2021-07-24T16:41:41+05:30

ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక భేటీ నిర్వహించనున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేఘాలయ : ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఆయా రాష్ట్రాల సీఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా పాల్గొంటున్నారు. సరిహద్దు సమస్యలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. మేఘాలయ వేదికగా ఈ సమావేశం జరగనుంది.  అసోం, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరవుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాంతో అసోం సరిహద్దు సమస్యలను ఎదుర్కొంటోంది. కొన్ని రోజుల క్రితం ఇదే సమస్యపై అసోంలో అల్లర్లు కూడా జరిగాయి. ఈ సమస్యను కూడా అమిత్‌షా సంబంధిత ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. కేవలం ముఖ్యమంత్రులే కాకుండా, వివిధ పౌర సమాజపు నేతలతో కూడా అమిత్‌షా భేటీ కానున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2021-07-24T16:41:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising