శ్రీ జగన్నాథునికి అమిత్ షా పూజలు
ABN, First Publish Date - 2021-01-14T21:53:26+05:30
కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా గురువారం
అహ్మదాబాద్ : కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా గురువారం శ్రీ జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభం సందర్భంగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. ఆయన తన సొంత రాష్ట్రం గుజరాత్లో ఒక రోజు వ్యక్తిగత పర్యటన కోసం వచ్చారు.
అమిత్ షా ఇచ్చిన ఓ ట్వీట్లో, మకర సంక్రాంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ శుభం జరగాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలందరికీ మకర సంక్రాంతి పండుగ నూతన శక్తిని, ఉత్తమ ఆరోగ్యాన్ని సమకూర్చాలని ఆకాంక్షించారు. పొంగల్, మాఘ్ బిహు జరుపుకునేవారికి కూడా శుభాకాంక్షలు తెలిపారు.
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమవుతుందన్న సంగతి తెలిసిందే.
Updated Date - 2021-01-14T21:53:26+05:30 IST