ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ దాడి వెనుక అమిత్ షా ప్రోద్బలం ఉంది : మమతా బెనర్జీ

ABN, First Publish Date - 2021-08-09T19:40:13+05:30

ఈ ఘటన వెనుకు హోం మంత్రి అమిత్ షా ప్రోద్బలం ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎమ్‌సీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌పై ఇటీవల కొందరు కర్రలు, లాఠీలతో దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బీజేపీ కార్యకర్తలు కారణమంటూ టీఎమ్‌సీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే..దీని వెనుక హోం మంత్రి అమిత్ షా ప్రోద్బలం ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా ఆరోపించారు. ‘‘హోం మంత్రి క్రియాశీలక మద్దతు లేకుండా ఇటువంటి దాడులు జరిగి ఉండేవి కావు. త్రిపుర రాష్ట్ర పోలీసులు ఎదుటే ఈ దాడి జరిగింది. కానీ పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉండిపోయారు. ఇటువంటి దాడిని ఆదేశించే ధైర్యం త్రిపుర ముఖ్యమంత్రికి లేదు’’ అని మమతా బెనర్జీ ఆరోపించారు. త్రిపురలో టీఎమ్‌సీని మరింత విస్తరించే ఉద్దేశ్యంతో అభిషేక్ బెనర్జీ ఇటీవల రాష్ట్ర రాజధానిలో టీఎంసీ నేతలను కలిసేందుకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో పలువురు టీఎంసీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. 

Updated Date - 2021-08-09T19:40:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising