ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగ్రవాద సంస్థ పార్లమెంటు ఘెరావ్ హెచ్చరిక... భద్రత కట్టుదిట్టం...

ABN, First Publish Date - 2021-11-29T16:20:32+05:30

నిషేధిత ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : నిషేధిత ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) పార్లమెంటు హౌస్‌ను ఘెరావ్ చేసే అవకాశం ఉందని, పార్లమెంటు భవనంపై ఖలిస్థాన్ జెండాను ఎగురవేసే అవకాశం ఉందని నిఘా సమాచారం రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సంస్థ కౌన్సిల్ జనరల్ గుర్‌పత్వంత్ సింగ్ పన్ను యూట్యూబ్‌లో ఓ వీడియోను విడుదల చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. 


పన్ను విడుదల చేసిన వీడియోలో రైతులకు ఓ సందేశం ఉంది. శీతాకాల సమావేశాల సమయంలో పార్లమెంటును ఘెరావ్ చేయాలని, ఖలిస్థాన్ జెండాను ఎగురవేయాలని రైతులకు పన్ను పిలుపునిచ్చాడు. పార్లమెంటు భవనంపై ఖలిస్థానీ జెండాను ఎగురవేసిన వ్యక్తికి 1,25,000 డాలర్లు బహుమతి ఇస్తామని ప్రకటించాడు. 


ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంబంధిత వ్యవస్థలన్నిటినీ హెచ్చరించాయి. ఢిల్లీ పోలీసులతో సహా అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపాయి. పార్లమెంటు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని తెలిపాయి. 


పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతాయి. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 23 వరకు జరుగుతాయి. 


Updated Date - 2021-11-29T16:20:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising