అమర్నాథ్ యాత్ర రద్దు... ఆన్లైన్లోనే దర్శనం
ABN, First Publish Date - 2021-06-21T23:04:55+05:30
కరోనా దృష్ట్యా అమర్నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు
శ్రీనగర్ : కరోనా దృష్ట్యా అమర్నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. వచ్చే యేడాదే అమర్నాథ్ యాత్ర ఉంటుందని తెలిపారు. అయితే భక్తుల సౌకర్యార్థం అమర్నాథ్ లింగాన్ని ఆన్లైన్లో దర్శనం చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. భక్తులందరూ తమ తమ ఇళ్లలోనే ఉండి, సౌకర్యవంతంగా, క్షేమంగా మంచు లింగాన్ని దర్శించుకోవచ్చని సూచించారు. ఇదంతా ప్రజల బాగుకోసమేనని ఎల్జీ మనోజ్ సిన్హా తెలిపారు.
Updated Date - 2021-06-21T23:04:55+05:30 IST