ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రిపై వచ్చిన ఆరోపణలు చాలా సీరియస్ : శరద్ పవార్

ABN, First Publish Date - 2021-01-14T22:26:59+05:30

మంత్రి ధనుంజయ్ ముండేపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మంత్రి ధనుంజయ్ ముండేపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై పార్టీ చర్చిస్తుందని, తొందర్లోనే ఓ నిర్ణయం తీసుకుంటామని పవార్ గురువారం ప్రకటించారు. ‘‘ఆయనపై వచ్చిన ఆరోపణలు చాలా సీరియస్. సహజంగానే పార్టీలో దీనిపై చర్చిస్తాం. దీనిపై పార్టీ ముఖ్యులతో చర్చిస్తాం. వారి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం. అతి తొందర్లోనే నిర్ణయం తీసుకుంటాం.’’ అని పవార్ ప్రకటించారు. 


మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధనంజయ్ ముండేపై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేసింది. మంత్రిని బావగా పేర్కొన్న ఆ యువతి, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 14 ఏళ్లుగా అత్యాచారం చేశారంటూ ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలీవుడ్‌లో అవకాశాలు ఇప్పిస్తానని ముండే తనను లోబర్చుకున్నారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని, కాపాడాలని పోలీసులను కోరింది. అయితే ఈ ఆరోపణలను మంత్రి ధనంజయ్ ముండే ఖండించారు. 

Updated Date - 2021-01-14T22:26:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising