ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడ‌ప‌డుచు వివాహానికి అఖిలేష్‌... మురిసిన ములాయం బంధుగ‌ణం!

ABN, First Publish Date - 2021-06-20T15:15:53+05:30

ఇంటి ఆడ‌ప‌డుచు పెళ్లి వేడుక‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సైఫాయి: ఇంటి ఆడ‌ప‌డుచు పెళ్లి వేడుక‌లో ములాయం కుటుంబమంతా క‌లుసుకుంది.పెళ్లికి ఒక రోజు ముందు యూపీలోని సైఫాయిలో జరిగిన విందు కార్య‌క్ర‌మానికి ములాయం సోద‌రుడు శివపాల్‌తో సహా కుటుంబ సభ్యులంతా అతిథులకు ఆహ్వానం పలికారు. అయితే కోవిడ్ నిబంధనల కారణంగా, కొద్దిమందిని మాత్రమే విందుకు ఆహ్వానించారు. ఈరోజు జ‌ర‌గ‌నున్న పెళ్లివేడుక కోసం ములాయం ఇంటిని, క‌ల్యాణ‌మండ‌పాన్ని అందంగా అలంక‌రించారు. ములాయం సింగ్ మనవరాలు, మెయిన్‌పురి మాజీ ఎంపీ తేజ్ ప్రతాప్ యాదవ్ సోదరి దీపాలికి ఫిరోజాబాద్‌లోని జస్రానాకు చెందిన జవహర్ సింగ్ యాదవ్ కుమారుడు అశ్వని యాదవ్‌తో వివాహం జ‌ర‌గ‌నుంది. వివాహ విందు కార్య‌క్ర‌మాన్ని రెండు రోజుల పాటు ఏర్పాటు చేశారు. మొదటి రోజున‌ సమీప గ్రామాల ప్ర‌జ‌ల‌తో పాటు కొంతమంది ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించారు. వేడుక‌కు వచ్చిన అతిథుల‌ను ప్రస్పా అధ్యక్షుడు శివపాల్ సింగ్ యాదవ్, మాజీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ త‌దిత‌రులు స్వాగ‌తించారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కుటుంబ స‌భ్యుల‌తో పాటు వివాహానికి హాజ‌ర‌య్యారు. ములాయం సింగ్ యాదవ్ ముందుగానే సైఫాయి చేరుకున్నారు. ములాయం కుటుంబమంతా ఈ వివాహ వేడుక‌కు హాజ‌రయ్యింది. 

Updated Date - 2021-06-20T15:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising