కోవిడ్ టీకా శిబిరాన్ని రద్దు చేసిన ఎయిర్ ఇండియా
ABN, First Publish Date - 2021-05-11T22:29:35+05:30
కోవిడ్ టీకా శిబిరాన్ని రద్దు చేసిన ఎయిర్ ఇండియా
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీకాలు అందుబాటులో లేకపోవడంతో ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతిపాదిత కోవిడ్ -19 టీకా శిబిరాన్ని రద్దు చేయబడిందని ఎయిర్ ఇండియా విడుదల చేసిన లేఖలో తెలిపింది. ఈ శిబిరం మే 11 మరియు మే 13న జీఎస్డీ కాంప్లెక్స్లో జరగాల్సి ఉంది. కోవిడ్ శిబిరం గురించి ప్రభుత్వ అధికారుల నుంచి అధికారికంగా సమాచారం వచ్చినప్పుడు కొత్త తేదీలను ప్రకటిస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది.
Updated Date - 2021-05-11T22:29:35+05:30 IST