ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాలిబన్ల తీరును వెల్లడించిన కాబుల్ మహిళా జర్నలిస్టు!

ABN, First Publish Date - 2021-08-19T13:57:36+05:30

తాలిబన్ల పాలనలోకి అఫ్ఘానిస్తాన్ వెళ్లిపోయిన నేపధ్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తాలిబన్ల పాలనలోకి అఫ్ఘానిస్తాన్ వెళ్లిపోయిన నేపధ్యంలో కాబుల్‌లో చిక్కుకుపోయిన భారతీయ జర్నలిస్టు కనికా గుప్తాతో పాటు 120 మందికిపైగా భారతీయులను సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చారు. స్వదేశానికి వచ్చిన మహిళా జర్నలిస్టు కనికా మీడియాకు తాలిబన్ల తీరు గురించి వెల్లడించారు. అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన అనంతరం తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. 


తాను అక్కడి దుర్భర పరిస్థితులను ప్రత్యక్షంగా చూశానని, వాటిని చెప్పేటప్పుడు కూడా వణుకు వస్తుందని అన్నారు. వారు అఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నాక శాంతియుత వాతావరణం నెలకొల్పుతామని చెప్పారన్నారు. అయితే వారు తమను ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతివ్వలేదని, అటువంటి పరిస్థితిలోనే తాను రిపోర్టింగ్ చేశానని కనికా తెలిపారు. తన ఇంటి కిటికీ నుంచి బయటకు చూడగా, ఉద్రిక్త వాతావరణం కనిపించిందన్నారు. అక్కడి పరిస్థితులను గమనించిన కొందరు ప్రజలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారన్నారు. గడచిన రెండు నెలల్లో అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. అక్కడ సెలూన్లను మూసివేశారని, బుర్కాలకు మరింత డిమాండ్ పెరిందన్నారు.

Updated Date - 2021-08-19T13:57:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising