బీజేపీలో చేరిన నటుడు మిథున్ చక్రవర్తి
ABN, First Publish Date - 2021-03-07T19:12:06+05:30
తృణమూల్ మాజీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి ఆదివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కోల్కతాలో జరిగిన ఓ బహిరంగ సభలో
కోల్కతా : తృణమూల్ మాజీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి ఆదివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కోల్కతాలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ బెంగాల్ వ్యవహారాల ఇన్చార్జి కైలాస్ విజయ వర్గీయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇదే సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రధాని మోదీయే స్వయంగా కండువా కప్పి, పార్టీలోకి ఆయన్ను ఆహ్వానిస్తారని భావించారు. కానీ మోదీ రాక మునుపే ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.
Updated Date - 2021-03-07T19:12:06+05:30 IST