భారత్కు చిరస్మరణీయమైన రోజు
ABN, First Publish Date - 2021-01-17T07:53:07+05:30
కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన రోజు దేశ ప్రజలకు చిరస్మరణీయమైన రోజని ఉప రాష్ట్రపతి వెంకయ్య
కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభంపై ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ, జనవరి 16: కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన రోజు దేశ ప్రజలకు చిరస్మరణీయమైన రోజని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంతో కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో భారత్ కొత్త మైలురాయిని అందుకుని చరిత్రను లిఖించిందని ఫేస్బుక్లో ఆయన కొనియాడారు.
ఇది ప్రతి భారతీయ పౌరుడూ గర్వించదగ్గ సందర్భమని, రికార్డు సమయంలోనే వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
Updated Date - 2021-01-17T07:53:07+05:30 IST