ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురు కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-11-21T16:51:55+05:30

సీనియర్ కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, దిగ్విజయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముజఫర్‌పూర్ (బిహార్) : సీనియర్ కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, దిగ్విజయ సింగ్, పి చిదంబరంలపై స్థానిక చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఓ ఫిర్యాదు దాఖలైంది. వీరు హిందూ మతాన్ని కించపరిచారని పిటిషనర్ ఆరోపించారు. సల్మాన్ ఖుర్షీద్ రాసిన ‘‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య’’ పుస్తకంలో ఓ అధ్యాయం హిందుత్వానికి అవమానకరంగా ఉందని పేర్కొన్నారు. 


ముజఫర్‌పూర్ వాసి ఆచార్య చంద్ర కిశోర్ పరాశర్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది కమలేశ్ కుమార్ మాట్లాడుతూ, సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకం ‘‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య’’లో ‘శాఫ్రన్ స్కై’ అనే అధ్యాయం హిందూ మతాన్ని కించపరిచేవిధంగా ఉందని చెప్పారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సల్మాన్ ఖుర్షీద్, దిగ్విజయ సింగ్, పి చిదంబరం రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఆరోపించారు. 


ఇదిలావుండగా, ఈ పుస్తకంపై నిషేధం విధించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఆయన ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఓ లేఖ రాశారు. సల్మాన్ ఖుర్షీద్ హిందువులను అవమానించారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 


Updated Date - 2021-11-21T16:51:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising