5 జిల్లాల్లోనే Covid ప్రభావం
ABN, First Publish Date - 2021-11-26T16:46:58+05:30
రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఐదు జిల్లాల్లో ప్రభావం చూపుతున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 306 మందికి పాజిటివ్ నిర్దారణ కాగా బెంగళూరులో 171, దార్వాడలో 42, మైసూరు 20, ఉడిపి, దక్షిణ కన్నడలో 13 మందికి
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఐదు జిల్లాల్లో ప్రభావం చూపుతున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 306 మందికి పాజిటివ్ నిర్దారణ కాగా బెంగళూరులో 171, దార్వాడలో 42, మైసూరు 20, ఉడిపి, దక్షిణ కన్నడలో 13 మందికి పాజిటివ్ ప్రబలింది. దార్వాడ మెడికల్ క ళాశాలలో 42 మందికి పాజిటివ్ తేలగా మరో 20 మందికి పైగా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. 8 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 224 మంది కోలుకోగా ఇరువురు మృతిచెందారు. కలబుర్గి, కోలార్ జిల్లాల్లో ఒకొక్కరు ఉన్నారు. 28 జిల్లాల్లో ఒక్కరు కూడా మృతిచెందలేదు.
Updated Date - 2021-11-26T16:46:58+05:30 IST