ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cyclone Tauktae: బార్జ్ విషాదం.. 49 మృతదేహాల వెలికితీత

ABN, First Publish Date - 2021-05-21T02:03:15+05:30

బార్జ్ ‘పి305’ మునిగిపోయిన ఘటనలో ఇప్పటి వరకు 49 మంది మృతదేహాలను వెలికి తీశారు. తౌక్తే తుపాను కారణంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: బార్జ్ ‘పి305’ మునిగిపోయిన ఘటనలో ఇప్పటి వరకు 49 మంది మృతదేహాలను వెలికి తీశారు. తౌక్తే తుపాను కారణంగా ముంబై తీరంలోని అరేబియా సముద్రంలో ఇది మునిగిపోయింది. దుర్ఘటన సమయంలో బార్జ్‌లో 261 మంది ఉండగా, వారిలో 186 మందిని రక్షించినట్టు నేవీ అధికారులు తెలిపారు. అలాగే, టగ్‌బోట్ వరప్రద నుంచి ఇద్దరిని రక్షించినట్టు పేర్కొన్నారు. ఇంకా 37 మంది జాడ కనిపించడం లేదన్నారు. వీరిలో 26 మంది బార్జ్ పి305లోని వారు కాగా, టగ్‌బోటుకు సంబంధించి 11 మంది ఉన్నారు. 


గల్లంతైన వారి కోసం నేవీ ఈ ఉదయం నుంచి ఏరియల్ సెర్చ్ ప్రారంభించింది. నాలుగు రోజుల క్రితం ముంబై తీరంలో  హెలికాప్టర్లను మోహరించింది. ఇంకా ఎవరైనా సజీవంగా ఉండొచ్చన్న ఆశతో నౌకలు కూడా సెర్చ్ లైట్ల సాయంతో రాత్రంతా గాలించాయి. కనీసం మరో మూడు రోజులపాటు గాలింపు చర్యలు కొనసాగనున్నట్టు నేవీ కమాండర్ అజయ్ ఝా తెలిపారు.  

Updated Date - 2021-05-21T02:03:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising