ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్రికా కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడి... నలుగురు జర్నలిస్టులకు గాయాలు

ABN, First Publish Date - 2021-09-09T15:13:38+05:30

త్రిపుర రాజధాని అగర్తలలో ఒక పత్రికా కార్యాలయంపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగర్తలా: త్రిపుర రాజధాని అగర్తలలో ఒక పత్రికా కార్యాలయంపై భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఉదంతంలో కొందరు బీజేపీ నేతల హస్తముందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ‘ప్రతివాదీ కలం’ అనే స్థానిక దినపత్రిక కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురు జర్నలిస్టులు గాయపడ్డారు. 


కొంతమేరకు ఆస్తినష్టం కూడా వాటిల్లింది. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ‘ప్రతివాదీ కలం’ సంపాదకుడు అనల్ రాయ్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన అనంతరం అగర్తల ప్రెస్ క్లబ్ సెక్రటరీ ప్రణబ్ సర్కార్‌తో పాటు పలు మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు  ‘ప్రతివాదీ కలం’ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ దాడులకు పాల్పడ్డవారిని వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో అధికార బీజేపీ విపక్ష భారతీయ కమ్యూనిస్టు పార్టీ ల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Updated Date - 2021-09-09T15:13:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising