ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుల్వామాలో పోలీస్ టీమ్‌పై ఉగ్రవాదుల దాడి

ABN, First Publish Date - 2021-09-14T21:15:52+05:30

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి దాడికి దిగారు. పోలీసు గస్తీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి దాడికి దిగారు. పోలీసు గస్తీ వాహనంపై గ్రనేడ్ దాడి చేశారు. మంగళవారం మధ్యాహ్నం పుల్వామాలోని మెయిన్ చౌక్ వద్ద జరిగిన ఈ దాడిలో నలుగురు పౌరులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని బలగాలు తమ అధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. కశ్మీర్ లోయలో ఇటీవల కాలంలో గ్రనేడ్ దాడి ఘటనలు పెరుగుతున్నాయి. గత వారంలో శ్రీనగర్‌లోని చనాపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు గాయపడ్డారు. కాగా, సోమవారంనాడు నేషనల్ హైవే 44పై అమర్చిన 6 చైనా గ్రనేడ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ గ్రనేడ్‌లను ఒక ఇసుక బస్తాలో కనుగొన్నారు.

Updated Date - 2021-09-14T21:15:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising