ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ర్టాలకు 31.80 టన్నుల ఆహారధాన్యాలు

ABN, First Publish Date - 2021-05-19T08:01:14+05:30

కరోనా విజృంభణ నేపథ్యంలో రా ష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మే నెలకు సంబంధించి 31.80 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ శాఖ వెల్లడించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాబితాలో ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాలు 


న్యూఢిల్లీ, మే 18 (ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభణ నేపథ్యంలో రా ష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మే నెలకు సంబంధించి 31.80 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ శాఖ వెల్లడించింది. పేద ప్రజల ఆర్థిక దుస్థితిని పరిగణనలోకి తీసుకుని ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన(పీఎంజీకేఏవై) కింద వీటిని అందిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం కేంద్రం రూ.26వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది. ఆహారధాన్యాలను ఉచితంగా అందుకోనున్న 15 రాష్ర్టాల్లో ఏపీ, తెలంగాణ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, అరుణాచల్‌ప్రదేశ్‌, గోవా, ఛత్తీ్‌సఘఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, లద్ధాఖ్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌ పుదుచ్చేరి, తమిళనాడు, త్రిపురలకు ఉన్నట్లు వివరించింది. ఈ పథకం కింద ఒక్కో పేద కుటుంబానికి5కిలోల ఆహారధాన్యాలు పంపిణీ చేస్తారు. దీంతో మొత్తం 79.39కోట్ల మంది లబ్ధిపొందనున్నారు. పేదలకు ప్రతినెలా పంపిణీ చేస్తున్న ఆహారధాన్యాలకు ఇది అదనమని కేంద్రం పేర్కొంది. 

Updated Date - 2021-05-19T08:01:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising