2న చెన్నైకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
ABN, First Publish Date - 2021-07-25T13:24:46+05:30
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఆయన వచ్చే ఆగస్టు 2వ తేదీన నగరానికి రానున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల ఢిల్లీకి వెళ్లి తమిళనాడు అసెంబ్లీ శతవా
చెన్నై: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఆయన వచ్చే ఆగస్టు 2వ తేదీన నగరానికి రానున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల ఢిల్లీకి వెళ్లి తమిళనాడు అసెంబ్లీ శతవార్షికోత్సవంలో పాల్గొనాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, శనివారం అసెంబ్లీ స్పీకర్ అప్పావు మీడియాతో మాట్లాడుతూ... తమిళనాడు అసెంబ్లీ శతవార్షికోత్సవంలో ఆగస్టు 2వ తేదీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొనబోతున్నారని, ఆ రోజు సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చిత్రపటాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి స్టాలిన్ పాల్గొంటారని, కార్యక్రమ ఏర్పాట్లను అసెంబ్లీ కార్యదర్శి పర్యవేక్షిస్తున్నారని స్పీకర్ అప్పావు తెలిపారు.
Updated Date - 2021-07-25T13:24:46+05:30 IST