27 మంది విద్యార్థులకు Covid పాజిటివ్
ABN, First Publish Date - 2021-12-03T16:45:37+05:30
తారాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 27 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తిరుప్పూర్ జిల్లా తారాపురంలోని పాఠశాలల్లో వైద్యబృందాలు విద్యార్థులకు పరీక్షలు చేపడుతున్నాయి. ఓ ప్రైవేటు పాఠశాలల్లోని
చెన్నై: తారాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 27 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తిరుప్పూర్ జిల్లా తారాపురంలోని పాఠశాలల్లో వైద్యబృందాలు విద్యార్థులకు పరీక్షలు చేపడుతున్నాయి. ఓ ప్రైవేటు పాఠశాలల్లోని ముగ్గురు సిబ్బంది సహా 27 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారిని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాఠశాలకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించిన అధికారులు, పాఠశాల, పరిసర ప్రాంగణాల్లో క్రిమినాశిని మందు పిచికారీతో పాటు మిగిలిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
Updated Date - 2021-12-03T16:45:37+05:30 IST