ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రకలకలం.. ఇద్దరు జవాన్లు సహా ఐదుగురి మృతి

ABN, First Publish Date - 2021-06-13T00:03:01+05:30

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌లో సీఆర్‌పీఎఫ్, కశ్మీర్ పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌లో సీఆర్‌పీఎఫ్, కశ్మీర్ పోలీసులు సంయుక్త బృందంపై గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు, ముగ్గురు పౌరులు మృతి చెందారు. మరో పోలీసు, ముగ్గురు పౌరులు గాయపడ్డారు. పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు తొలుత గ్రనేడ్లు విసిరి ఆపై కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అదనపు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టి ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించాయి. కాగా, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయి వారికి జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం తెలిపారు.

Updated Date - 2021-06-13T00:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising