ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మసీదులో పేలుడు.. 100 మంది మృతి

ABN, First Publish Date - 2021-10-09T00:14:06+05:30

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రమూకలు మరోమారు చెలరేగిపోయాయి. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కుందుజ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రమూకలు మరోమారు చెలరేగిపోయాయి. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కుందుజ్ నగరంలోని మసీదుపై ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం జరిపిన బాంబు దాడిలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా, మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు తాలిబన్ పోలీసు అధికారి వెల్లడించారు.


కుందుజ్ ప్రావిన్స్‌లోని బందర్ జిల్లా ఖాన్ అదాబ్‌లోని షియా మసీదులో ఈ పేలుడు సంభవించిందని, ఈ ఘటనలో పలువురు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. పేలుడు దాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. మసీదు మొత్తం రక్తంతో నిండిపోయింది. శరీరాలు రక్తపు ముద్దలుగా మారాయి. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో తీరని విషాదం నిండుకుంది. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇదిలావుండగా, ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని నగరం కాబూల్‌లో సిక్కు మైనారిటీల గురుద్వారాపై మంగళవారం తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేశారు. సీసీటీవీ కెమెరాలను, ఇతర వస్తువులు, పరికరాలను ధ్వంసం చేశారు. ఇండియన్ వరల్డ్ ఫోరం అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్ ఇచ్చిన ట్వీట్‌లో ఈ వివరాలను తెలిపారు. 

Updated Date - 2021-10-09T00:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising