ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. కరోనా రోగులు సజీవదహనం

ABN, First Publish Date - 2021-11-06T19:58:04+05:30

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు అహ్మద్ నగర్ కలెక్టర్ రాజేంద్ర భోస్లే ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు అహ్మద్ నగర్ కలెక్టర్ రాజేంద్ర భోస్లే ప్రకటించారు. ఆసుపత్రి ఐసీయూలో మంటలు చెలరేగడంతో అందులో చికిత్స పొందుతున్న కరోనా రోగులు సజీవదహనం అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా కరోనా వార్డులో 17 మంది చికిత్స పొందుతుండగా వారిలో 10 మంది అగ్నిప్రమాదంలో మరణించినట్లు కలెక్టర్ తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Updated Date - 2021-11-06T19:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising