యూ ట్యూబ్ నటిని వేధిస్తున్న డైవ్రర్ పై కేసు
ABN, First Publish Date - 2021-01-25T15:57:42+05:30
యూ ట్యూబ్ నటిని వేధిస్తున్న డ్రైవర్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాదాపూర్కు చెందిన ఓ యువతి యూ ట్యూబ్ చానెల్ నటి. ఆమె వద్ద ...
హైదరాబాద్/బంజారాహిల్స్(ఆంధ్రజ్యోతి): యూ ట్యూబ్ నటిని వేధిస్తున్న డ్రైవర్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాదాపూర్కు చెందిన ఓ యువతి యూ ట్యూబ్ చానెల్ నటి. ఆమె వద్ద షేక్ ఇబ్రహీం రెండు సంవత్సరాలుగా డైవ్రర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 13న యువతి డ్రైవర్తో కలిసి కేరళకు వెళ్లింది. డ్రగ్స్కు అలవాటు పడ్డ ఇబ్రహీం సమయానికి అవి దొరకక ఆమెను అసభ్యంగా వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమె తిరిగి నగరానికి వచ్చి ఫిలింనగర్లోని గెస్ట్హౌ్సలో ఉంటోంది. ఈ నెల 22న గెస్ట్హౌ్సకు వచ్చిన ఇబ్రహీం ఆమె వద్ద బంగారు గొలుసు లాక్కున్నాడు. అనంతరం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇబ్రహీం గొలుసు తిరిగి ఇచ్చేసి అక్కడి నుంచివెళ్లిపోయాడు. ఇబ్రహీం తనను మానసికంగా వేధిస్తున్నాడని యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపిసి 354 సెక్షన్ కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-01-25T15:57:42+05:30 IST