ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృదువైన పాదాల కోసం...

ABN, First Publish Date - 2021-07-05T16:40:14+05:30

పాదాల పగుళ్లు కొందరిని చాలా ఇబ్బందిపెడతాయి. అయితే చిన్న చిన్న చిట్కాలతో వాటిని సులభంగా దూరం చేసుకోవచ్చు. పాదాల పగుళ్లు పోవాలంటే ఇలా చేయాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(05-06-2021)

పాదాల పగుళ్లు కొందరిని చాలా ఇబ్బందిపెడతాయి. అయితే చిన్న చిన్న చిట్కాలతో వాటిని సులభంగా దూరం చేసుకోవచ్చు. పాదాల పగుళ్లు పోవాలంటే ఇలా చేయాలి...


అరటిపండు న్యాచురల్‌ మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. రెండు అరటిపండ్లను మెత్తగా చేసి పాదాలకు రాయాలి. అరగంట తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. రెండు వారాల పాటు ఇలా చేస్తే పగుళ్లు తగ్గిపోతాయి.

ఒక టబ్‌లో కొన్ని గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో ఒక కప్పు తేనె వేయాలి. అందులో పాదాలు పెట్టి ఇరవై నిమిషాల పాటు నెమ్మదిగా పాదాలపై మర్దన చేయాలి. తరువాత పాదాలను పొడిగుడ్డతో తుడిచి మాయిశ్చర్‌ రాసుకోవాలి. 

గోరువెచ్చని నీటిలో పావుగంటపాటు పాదాలను పెట్టి తరువాత పొడిగుడ్డతో తడుచుకోవాలి. తరువాత ఒక టీస్పూన్‌ వ్యాజిలైన్‌లో నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి పాదాలకు రాసుకుని సాక్స్‌ ధరించి పడుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు దూరమవుతాయి.

పాదాలను గోరువెచ్చటి నీళ్లలో పదినిమిషాలు పెట్టాలి. తరువాత రెండు టేబుల్‌స్పూన్ల బియ్యప్పిండి, ఒక టీస్పూన్‌ తేనె, నాలుగైదు చుక్కల వెనిగర్‌ను పేస్టులా చేసి పగుళ్లు ఉన్న చోట స్క్రబ్‌ చేయాలి. వారంలో రెండు, మూడు సార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

Updated Date - 2021-07-05T16:40:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising