ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోనార్ బంగ్లా వెనుక బీజేపీ 'విభజన' రాజకీయం: రాహుల్

ABN, First Publish Date - 2021-04-14T23:33:30+05:30

బెంగాల్‌ను ధ్వంసం చేసి విభజించాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: బెంగాల్‌ను ధ్వంసం చేసి విభజించాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి గోయల్‌పోఖోర్‌లో బుధవారంనాడు జరిగిన సభలో రాహుల్ మాట్లాడుతూ, అసోం, తమిళనాడులో తరహాలోనే బెంగాల్‌ను ధ్వంసం చేసి విభజించాలని బీజేపీ చూస్తోందన్నారు. బీజేపీ 'బంగారు బంగ్లా' నినాదంపై రాహుల్ చురకలు వేశారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇదేతరహా మాయమాటలు చెబుతుంటారని అన్నారు. నిజానికి వాళ్లు మతం, కులం, భాష పేరుతో విడగొట్టడం మాత్రమే చేస్తుంటారని విమర్శించారు.


బీజేపీతో పోరాటానికి మమతా బెనర్జీ ఈసారి పూర్తిశక్తియుక్తులు ఒడ్డుతున్నారన్న వాదనపై రాహుల్ మాట్లాడుతూ, మమతా బెనర్జీ గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, తాను కానీ, తమ పార్టీ కానీ ఎప్పుడూ ఆ పని చేయలేదని అన్నారు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఎన్డీయేలో మమత భాగస్వామిగా ఉన్నారని, రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేశారని అన్నారు. ''టీఎంసీకి  మీరు అవకాశం ఇచ్చారు. కానీ వాళ్లు విఫలమయ్యారు. ఉద్యోగాల కోసం ప్రజలు ఎన్నో పాట్లు పడుతున్నారు. ఉద్యోగాలు కావలంటే కట్ మనీ తప్పనిసరి. బెంగాల్‌లో ఈ పరిస్థితి కనిపిస్తుంది'' అని రాహుల్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో సీపీఎంతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తోంది.

Updated Date - 2021-04-14T23:33:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising