చదువులో వెనకబడుతున్నానని విద్యార్థి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-12-06T18:59:59+05:30
చదువులో..
హైదరాబాద్ సిటీ/హైదర్నగర్: చదువులో వెనకబడుతున్నానని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కేపీహెచ్బీ పోలీ్సస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి జయనగర్లో నివాసం ఉండే మారుతీకుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇతడి మేనల్లుడు సాయికృష్ణ మయాంక్(22) కేపీహెచ్బీ ఫేజ్-9లో ఉంటూ కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. చదువులో వెనకబడి తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో తాను ఉంటున్న గదిలో శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ స్నేహితుడు బాలు గమనించి మారుతీకుమార్కు సమాచారం ఇచ్చాడు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-12-06T18:59:59+05:30 IST