ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు

ABN, First Publish Date - 2021-10-09T13:24:16+05:30

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

29న జరగాల్సిన పరీక్షలు 31కి మార్పు

30న జరగాల్సినవి నవంబరు 1కి 

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో రీషెడ్యూల్‌

ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటన


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను రీషెడ్యూల్‌ చేశారు. 29న జరగాల్సిన పరీక్షను 31వ తేదీకి, 30న జరగాల్సిన పరీక్షను నవంబరు 1వ తేదీకి మార్చారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కారణంగా గతేడాది ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించలేకపోయిన విషయం తెలిసిందే. వారందరినీ సెకండియర్‌కు ప్రమోట్‌ చేశారు. ఈ విద్యార్థులంతా ప్రస్తుతం సెకండియర్‌ పాఠాలను చదువుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితి అదుపులోకి రావడంతో ఫస్టియర్‌ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 



Updated Date - 2021-10-09T13:24:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising