Secunderabadలో సైనిక నియామక ర్యాలీ.. ఎప్పటినుంచి అంటే..
ABN, First Publish Date - 2021-10-13T13:59:51+05:30
సికింద్రాబాద్లోని ఏవోసీ సెంటర్లో..
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్లోని ఏవోసీ సెంటర్లో నవంబరు 29 నుంచి సైనిక నియామక ర్యాలీని నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద సోల్జర్ టెక్(ఏఈ), జనరల్ డ్యూటీ, ట్రేడ్స్మెన్, స్పోర్ట్స్మెన్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొంది. స్పోర్ట్స్మెన్ ఉద్యోగార్ధులు నవంబరు 26న సికింద్రాబాద్లోని థాపర్ స్టేడియంలో రిపోర్టు చేయాలని వివరించింది. వచ్చే ఏడాది జనవరి 30 వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని తెలిపింది. పూర్తి వివరాలకు ఏవోసీ సెంటర్ హెడ్ క్వార్టర్స్ను లేదా వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది. ఈ సైనిక నియామక ర్యాలీలలో కొవిడ్ నిబంధనలను అభ్యర్థులు విధిగా పాటించాలని స్పష్టం చేసింది.
Updated Date - 2021-10-13T13:59:51+05:30 IST