ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక

ABN, First Publish Date - 2021-10-22T13:29:15+05:30

తమ ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుకగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఏ 3%పెంపు... గత జూలై 1 నుంచి అమలు


న్యూఢిల్లీ(ఆంధ్రజ్యోతి): తమ ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం డీఏను 3% పెంచింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని డీఏ పెంపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పెంచిన డీఏను గత జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పీఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌కు కూడా క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని ద్వారా రూ.100లక్షల కోట్లతో మల్టీ మోడల్‌ కనెక్టివిటీని అభివృద్ధి చేస్తారు. రోడ్డు, వాయు, జల రవాణా మార్గాలను అనుసంధానం చేస్తారు. లాజిస్టిక్స్‌ రంగంలో ఖర్చులను, సమయాన్ని తగ్గించడం, సరుకుల రవాణా సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా మౌలిక సౌకర్యాలను మెరుగుపర్చనున్నారు.  

Updated Date - 2021-10-22T13:29:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising