కొత్త వ్యవసాయచట్టాలపై సదస్సు
ABN, First Publish Date - 2021-10-15T07:48:39+05:30
ఇటీవల కన్నుమూసిన అంబటి పెద సైదయ్య (తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అద్యక్షులు అంబటి నాగయ్య తండ్రి) సంస్మరణ సభ రేపు ఉదయం గం. 10.30లకు సూర్యాపేట జిల్లా నేరేడు చర్ల...
ఇటీవల కన్నుమూసిన అంబటి పెద సైదయ్య (తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అద్యక్షులు అంబటి నాగయ్య తండ్రి) సంస్మరణ సభ రేపు ఉదయం గం. 10.30లకు సూర్యాపేట జిల్లా నేరేడు చర్ల మండలం చింతకుట్ల గ్రామంలో జరగనుంది. ఈ సందర్భంగా ‘తెలంగాణ వ్యవసాయ రంగంపై కేంద్రప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాల ప్రభావం’ అనే అంశంపై సదస్సు ఉంటుంది. కార్యక్రమంలో ముఖ్యవక్తలుగా వ్యవసాయ రంగ నిపుణులు కన్నెగంటి రవి, ప్రొఫెసర్ కోదండరాం, వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్. వేణుగోపాల్, విమలక్క, చెరుకు సుధాకర్, వక్కవంతుల కోటేశ్వరరావు, నాగన్న, తిప్పర్తి యాదయ్య తదితరులు పాల్గొంటారు. అనంతరం ‘నాగేటిసాలు’ పురస్కారాలు అందజేస్తారు.
పందుల సైదులు
Updated Date - 2021-10-15T07:48:39+05:30 IST