ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీ ఛీ వీడసలు మనిషేనా?.. క్షమాపణలతో వదిలేస్తే మళ్లీ అదే పనిచేసి పట్టుబడ్డాడు..

ABN, First Publish Date - 2021-12-06T16:02:23+05:30

మధ్యప్రదేశ్‌లోని రీవాలో మరో దారుణం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధ్యప్రదేశ్‌లోని రీవాలో మరో దారుణం చోటుచేసుకుంది.  సెమరియా పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు నాలుగేళ్ల క్రితం కూడా ఇదేవిధంగా బాలికపై అత్యాచారం చేశాడు. అయితే అప్పట్లో నిందితుడు.. బాధితురాలిని క్షమాపణలు కోరాడు. భవిష్యత్‌లో ఇటువంటి పనులు చేయనని బాధితురాలికి హామీ ఇచ్చాడు. దీంతో బాధితురాలితోపాటు ఆమె కుటుంబీకులు నిందితుడిని క్షమించి, పోలీసు కేసు లేకుండా వదిలేశారు. 


అయితే నిందితుడు మరోమారు తన వక్రబుద్ధి చూపించాడు. అయితే ఈ సారి బాధితురాలితో పాటు కుటుంబ సభ్యులు నిందితునిపై సెమరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో బాధితురాలికి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలికపై అత్యాచారం జరిగిందని నిర్ధారణ కావడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సెమరియా పోలీస్ స్టేషన్ హెడ్ అశోక్ గర్గ్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఒక బాలికపై అత్యాచారం జరిగిందనే ఫిర్యాదు వచ్చిందన్నారు. ఈ నేపధ్యంలో నిందితుడు రాజేష్ త్రిపాఠి(34)పై కేసు నమోదు చేశామన్నారు. అయితే నిందితుడు ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా బస్టాండ్ దగ్గర అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - 2021-12-06T16:02:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising