ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వాడు రాత్రి ఇంట్లోనే పడుకున్నాడు.. ఉదయం కాలకృత్యాలకు వెళ్లి, తిరిగి రాలేదు’’.. విషయం తెలిసి భోరుమంటున్న తల్లి!

ABN, First Publish Date - 2021-11-29T17:36:25+05:30

బీహార్‌లోని బక్సర్ జిల్లా, నచాప్ పంచాయతీ పరిధిలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీహార్‌లోని బక్సర్ జిల్లా, నచాప్ పంచాయతీ పరిధిలోని దంగౌలీ గ్రామంలో ఒక యువకుని మృతదేహం లభ్యమయ్యింది. ఆ యువకుడిని గ్రామానికి చెందిన దరోగ్ యాదవ్ ఉరఫ్ బసంత్ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. కుమారుడు మరణించాడన్న సంగతి తెలియగానే తల్లి అనారోగ్యం పాలయ్యింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో మృతుని తల్లి మాట్లాడుతూ తన కుమారుడిని గ్రామానికి చెందినవారే హత్య చేశారని ఆరోపించింది. గ్రామానికి చెందిన పింటూ యాదవ్, అతని కుమారుడు కలిసి తన కుమారుడిని హత్య చేసివుంటారని ఆమె పోలీసులకు తెలిపింది. రోజూ మాదిరిగానే తమ కుమారుడు రాత్రి ఇంటిలోనే పడుకున్నాడని, ఉదయం కాలకృత్యాలకు బయటకు వెళ్లి, మరి తిరిగి రాలేదన్నారు. 


కుమారునితో ఫోనులో మాట్లాడదామంటే.. ఫోను కూడా ఇంటిలోనే వదిలేసి వెళ్లాడన్నారు. ఇంతలో ఈ ఘోరం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ మృతుడు దరోగ్ యాదవ్ ఐదుగురు అన్నదమ్ములలో మూడవవాడన్నారు. దరోగ్ యాదవ్ గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నాడని, ఈ నేపధ్యంలోనే హత్య జరిగివుండవచ్చన్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ ఉదంతంలో సంబంధం ఉందని భావిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే దరోగ్ యాదవ్ మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించారు.

Updated Date - 2021-11-29T17:36:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising