ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం... ఏడుగురు మృతి!

ABN, First Publish Date - 2021-02-24T12:22:51+05:30

ఉత్తరప్రదేశ్‌లోని మధురలో మంగళవారం అర్థరాత్రి దాటాక...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో మంగళవారం అర్థరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నౌఝీల్ ప్రాతంలోని యమున ఎక్స్‌ప్రెస్‌వేపై డీజిల్ ట్యాంకర్‌ను ఇన్నోవా కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 


మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించారు. ఆగ్రా నుంచి వస్తున్న డీజిల్ ట్యాంకర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు అవతలి వైపునకు వెళ్లిపోయింది. ఈ సమయంలో నోయిడా నుంచి వస్తున్న ఇన్నోవా కారు ఈ ట్యాంకర్‌ను బలంగా ఢీకొంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎస్‌ఎస్పీ తన బృందంతో పాటు ప్రమాదస్థలికి చేరుకున్నారు. మృతులంతా హరియాణాలోని జీంద్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఎక్స్‌ప్రెస్ వేను మూసివేసి సహాయక చర్యలు చేపడుతున్నారు. 

Updated Date - 2021-02-24T12:22:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising