వాకింగ్ వెళ్తున్నానని చెప్పి.. భవనంపై నుంచి దూకిన మహిళ
ABN, First Publish Date - 2021-04-06T12:23:56+05:30
మతిస్థితిమితం లేని ఓ మహిళ నిర్మాణంలో ఉన్న భవనంపై...
హైదరాబాద్/చందానగర్ : మతిస్థితిమితం లేని ఓ మహిళ నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఎస్ఐ వెంకటేష్ కథనం ప్రకారం చందానగర్ కేఎస్ఆర్ ఎన్క్లేవ్లో నివాసం ఉండే వినోద(52) మతిస్థిమితం సరిగా లేకపోవడంతో నాలుగైదు సంవత్సరాల నుంచి ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకొంటోంది. సోమవారం ఉదయం వాకింగ్కు వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకువెళ్లి అదే కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వినోద ఎంతకీ తిరిగి రాకపోవడంతో కొడుకు, కూతురు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కాలనీ మొత్తం వెతకడంతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాన్ని గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Updated Date - 2021-04-06T12:23:56+05:30 IST