ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేపీహెచ్‌బీలో మహిళ దారుణ హత్య

ABN, First Publish Date - 2021-01-07T11:44:44+05:30

కేపీహెచ్‌బీకాలనీలో మహిళ హత్యకు గురైంది. ఖమ్మం జిల్లా ఇల్లందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/హైదర్‌నగర్‌ : కేపీహెచ్‌బీకాలనీలో మహిళ హత్యకు గురైంది. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన వెంకటేశ్వర్లు, స్రవంతి నగరానికి వచ్చారు. గత డిసెంబర్‌ 5న కేపీహెచ్‌బీకాలనీ సమీపంలోని శ్రీసత్యనారాయణ కాలనీలో ఫ్లాట్‌ నెంబర్‌ 75,76 వెళ్లారు. ఇంటి యజమాని రంగస్వామికి తాము భార్యాభర్తలమని, చెట్లకు వాడే మందులు విక్రయిస్తున్నామంటూ ఇంటిని అద్దెకు తీసుకొన్నారు. ఈ నెల 5న వెంకటేశ్వర్లు ఇంటి యజమాని రంగస్వామికి ఫోన్‌చేసి తాను ఇంటిని ఖాళీ చేస్తున్నామని చెప్పి... వెళ్లిపోయాడు. అదేరోజు సాయంత్రం ఇంటిని శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషికి ఇంటి మెట్ల కింద దుప్పటిలో శవం కనిపించింది. విషయం ఇంటి యజమాని రంగస్వామికి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహంపై గాయాలు ఉండడం గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రంగస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్రవంతిని తలపై బలమైన వస్తువుతో కొట్టడంతోపాటు మెడకు చున్నీతో ఉరిబిగించి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధార్‌ కార్డులో స్రవంతి భర్త పాపారావు అని ఉండడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-07T11:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising